ఆగిన పేదోడి ఉపాధి

1,450
  • గ్రామాల్లో ఆగిపోయిన ఉపాధి హామీ పనులు

బతుకమ్మ,మోర్తాడ్: ఆగస్టు 20:*గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలకపాత్ర పోషిస్తుందని తెలపడంలో అతిశయోక్తి లేదు. గ్రామాల్లోని పేదలకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అండగా నిలిచిందని తెలుపడంలో సందేహం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ జీవనోపాధి వరమని అనవచ్చు. అటువంటి ఉపాధి పని నిలిపివేయడంతో గ్రామాల్లోని పేద ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పని దినాలు పూర్తి..
ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి 69 లక్షల పని దినాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతంలో గ్రామసభలు నిర్వహించి పనులు గుర్తించారు. అయితే ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా కేవలం 40 లక్షలకే అనుమతులు వచ్చాయి. జిల్లాలో 530 గ్రామపంచాయితీల్లో జిల్లా వ్యాప్తంగా 2, 55,236 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 4,83,762 మంది నమోదైన కూలీలు ఉన్నారు. ఒక సంవత్సరంకు నిర్ణయించిన బడ్జెట్ కేవలం మూడు నెలల్లోనే అయిపోవడంతో ఉపాధి పనులు నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పనులు నిలిచిపోయాయి. కేవలం హరితహారం పనులు మాత్రమే చేయాలని కొన్ని రోజుల తర్వాత వాటిని కూడా నిలిపివేయాలని కింది స్థాయి అధికారులకు ఆదేశలు వచ్చినట్లు సమాచారం.
కూలి డబ్బులు పెరిగినందుకేనా..
సంవత్సర బడ్జెట్ మూడు నెలలు అయిపోవడానికి కారణం ఒకపక్క వర్షాలు ఆలస్యం కావడంతో మే నెలలో నిలిపివేయాల్సిన పనులు జూన్, జూలై వరకు కొనసాగడంతో కూలీలు అధిక సంఖ్యలో ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవడంతో డబ్బులు అయిపోయినట్లు తెలుస్తుంది. గతంలో కూలికి ఒక రోజు రూ.210 చెల్లిస్తే నూతన బడ్జెట్ ప్రకారం ఒక్కరోజు ఒక కూలికి రూ.300 చెల్లిస్తున్నారు. దీంతో బడ్జెట్ అయిపోయినట్లు తెలుస్తుంది.

ఉన్నతాధికారుల దృష్టికి..

సాయ గౌడ్ (గ్రామీణ అభివృద్ధి అధికారి) నిజామాబాద్.
ఉపాధి హామీలో పని దినాల విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి ప్రతిపాదనలు పంపించాము. ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రాగానే చేయవలసిన పనుల గురించి తెలియజేస్తాం.

Leave A Reply

Your email address will not be published.