న్యాల్ కల్ చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

499

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : మోపాల్ మండలంలోని న్యాల్ కల్ చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. నిజామాబాద్ నగరంలోని శివాజినగర్ కు చెందిన తెడ్డు సాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. తాను చనిపోతానని ఇంటి నుంచి వెళ్లిన సాగర్ న్యాల్ కల్ లోని మాసాని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న వారు యువకుడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మధ్యాహ్నం తర్వాత సాగర్ డెడ్ బాడిని వెలికి తీశారు. ఈ మేరకు మోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.