‘సోషల్ వెల్ఫేర్’ పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ ఎన్నిక

1,658

బతుకమ్మ, నిజామాబాద్: సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో పీఆర్టీయూ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ రాష్ర్ట కమిటీని ఎన్నుకున్నారు.  పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో ఉన్న చాచా నెహ్రూ పార్క్ లో శుక్రవారం సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పీఆర్టీయూ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ రాష్ర్ట అధ్యక్షుడిగా డాక్టర్ జీఎల్  స్వామి, జనరల్ సెక్రెటరీ గా ఆర్మూర్  సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్  కాలేజీ ఇంగ్లిష్ లెక్చరర్ వసంతరావు నాయక్ ను ఎన్నుకున్నారు. వసంత్ రావు నాయక్ తోపాటు జిల్లాకు చెందిన అంతేశ్వర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, సాయన్న రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా, గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్, రాష్ర్ట కమిటీ సభ్యుడిగా శ్యాం సుందర్ ను ఎన్నుకున్నారు. జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన వసంతరావు నాయక్ ను గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.