బతుకమ్మ, నందిపేట్ : రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న డెంగీ వ్యాధులు నివారించడానికి జిల్లా అధికారుల ఆదేశాలతో నందిపేట్ మండల వైద్య బృందం అప్రమత్తం అయి గ్రామాల బాట పట్టి ఇంటి -ఇంటి ఆరోగ్యసర్వే నిర్వహించి రోగాలు రాకుండా తీసుకొనే ముందు జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. గురువారం నందిపేట్ మరియు వెల్మల్ గ్రామలలో డెంగ్యూ వ్యాధి సోకిన ఇంటిని సందర్శించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించరు. ప్రత్యేక ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని కోరుతూ గ్రామంలోని ప్రతి ఇంటిని సర్వే చేసి వ్యాధులపై అవగాహన కల్పించరు. ఎస్సీ హాస్టల్ మరియు ప్రైవేట్ సూర్యోదయ పాఠశాల నందిపేట్ లో పైరేత్రియం ఇండోర్ స్ప్రే ను టెమోఫోస్ స్ప్రే ను చేయించారు, వైద్య బృందం తొ పాటు నందిపేట్ గ్రామ పంచాయితీ సెక్రటరీ నవీన్ వెల్మల్ కార్యదర్శి రంజిత్ ల ఆధ్వర్యంలో జి పి సిబ్బంధి ద్వార పరిసరల పారిశుభ్రత చేయించరు. ఇట్టి కార్యక్రమములో డా.ప్రవీణ్, సి ఎచ్ ఓ దెవన్నా, సాయన్న, పి ఎచ్ ఎన్ పద్మావతి, హెల్త్ సూపరవైజర్ భాస్కర్ పాల్గొన్నారు.
