కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్లోని శ్రీరామ్ రైతు రాజ్యం సీట్స్ & వెస్టిసైడ్స్ ప్రొప్రెటర్ జిల్లాల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మోషంపూర్, తిర్మన్ పల్లి, మర్కల్, సదాశివనగర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, కుప్రియల్, ధర్మారావుపేట్, కాళోజివాడి గ్రామాలలో గల గణపతి మండపాలకు ఆదివారం 40 లడ్డు ప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.