సాహిత పరిశోధనల్లో ఆణిముత్యం, చిరస్మనీయుడు కామ్రేడ్ డా.ముత్యం

1,246
  • సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య

నిజామాబాద్, బతుకమ్మ : కామ్రేడ్ డా.ముత్యం  సాహిత పరిశోధనల్లో ఆణిముత్యం అని , చిరస్మనీయుడని  సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య అన్నారు.  డాక్టర్ కే .ముత్యం సంస్మరణ సభ నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ లోని బస్వా గార్డెన్ లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.  సంస్మరణ సభకు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేములపల్లి వెంకటరామయ్య మాట్లడుతూ కామ్రేడ్ ముత్యం శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం ,సర్వదేవభట్ల ,రామనాథం సుబ్బారావు ప్రాణిగ్రహి జీవిత చరిత్ర, చిందుల ఎల్లమ్మ తెలంగాణ శాస్త్రాలు పిండిప్రోలు లాంటి అనేక పుస్తకాలను భవిష్యత్ తరాల కోసం ప్రచూరించి అందించాన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల అధ్యక్షులుగాగెలుపొందిన వ్యక్తి అని , ప్రజా సమస్యలపై అనేక ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తి ,మార్క్సిస్టు దృక్పథంతో అనేక పుస్తకాలు రచించారన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా ఉద్యమ సాహిత్య పరిశోధన జీవితంగా బతికినవాడు ముత్యం, ప్రజా దృక్పథంతో గతితార్కికంగా విశ్లేషించాడన్నారు. గొప్ప వివేచనతో గతాన్ని వర్తమానానికి అన్వయించాడని తెలిపారు. పరిశోధకుడిగా డాక్టర్ ముత్యానికి ఉత్తరాంధ్రకి పెనవేసుకొని ఉన్న బంధం విడదీయరానిది అన్నారు. నూతన ప్రజాస్వామిక దృక్పథంతో సామాజిక నిబద్ధతతో నికార్సయిన విప్లవద్యమస్పూర్తితో కామ్రేడ్ ముత్యం చేసిన సాహిత్య సంస్కృతిక పరిశోధనలను కొనసాగిస్తూ అతను స్వాసించిన మానవీయ ఆశయాల సాధనకు కృషి చేయడమే ఆయనకు మన అందించగల నిజమైన నివాళి అని అన్నారు.  ఈ కార్యక్రమంలో ముత్యం కుమార్తె ప్రత్యూష జమిని, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మేనేజింగ్ ట్రస్టి గొర్రెపాటి మాధవరావు, సిపిఐ ఎం ఎల్ న్యూ కేంద్ర కమిటీ సభ్యులు జే వీ చలపతిరావు , మాజీ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి , పొద్దు ఎడిటర్ బేస రాందాస్, న్యూ డెమోక్రసీ నాయకులు దాసు , వేల్పుర్ భూమయ్య, గౌతం కుమార్, పరుచూరి శ్రీధర్, నీలం సాయిబాబా,సూర్య శివాజీ, సరిత, తదితరులు పాల్గొన్నారు.

Animuthyam, Chirasmaniyadu Comrade Dr. Muthyam in literary researches

Leave A Reply

Your email address will not be published.