పెళ్లికి వచ్చి విద్యుత్ షాక్ తో మృతి

787

. మాయాపూర్ లో  విషాదం

బతుకమ్మ, బాల్కొండ : బంధువుల పెళ్లికి వచ్చిన  ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన ఉమ్మడి బాల్కొండ మండలం రెంజర్లలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నందిపేట మండలం మాయాపూర్ గ్రామానికి చెందిన గుడోల్ల అభిలాష్(20) తన బంధువుల ఇంట్లో పెళ్లిలో పాల్గొనేందుకు రెంజర్లకు వచ్చాడు. మంగళవారం రాత్రి ఓ వైపు హల్దీ వేడుక జరుగుతున్న సమయంలో ఫోన్ రావడంతో అభిలాష్ దాబాపైకి వెళ్లాడు. ఫోన్ మాట్లాడుతూ పొరపాటు పెళ్లి వేడుకల కోసం వేసిన లైటింగ్ కు చేయి తగలడంతో మృతి చెందాడు. పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.