మీ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రైతు కైనా న్యాయం చేశారా..?

1,978
  • పదేళ్లలో చేయని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తే  విమర్శించడం సిగ్గుచేటు
  • రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు దశలవారీగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తుంటే ఓర్వలేక టిఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తమపై విమర్శలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితీవ్ర స్థాయిలో మండిపడ్డారు.శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూపదేళ్ల కాలంలోఅప్పటి భారత రాష్ట్ర సమితి పార్టీ అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు రైతులకు ఏ విధంగా ఎలాంటి సహాయం చేయకపోగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలోనే అర్హులైన రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణమాఫీఅందిస్తున్న ఘనత తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. ఇవన్నీ మరిచి ప్రజల్లో గందరగోళం రేపేందుకు ప్రభుత్వంపై లేనిపోని పద్దం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఏ ప్రభుత్వం చేయనీ విధంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అందించడమే కాకుండా వారు పండించిన పంటలకు కూడా సరైన మద్దతు ధర కల్పిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీపై, తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శించే హక్కుఆ పార్టీ వారికి లేదని ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులుమానాల మోహన్ రెడ్డి,ఉర్దూ అకాడమీ చైర్మన్తాహెర్ బిన్ హంధాన్,నగర అధ్యక్షులు కేశవేణు,కిసాన్ కేట్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.