బతుకమ్మ, రెంజల్ : రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన శివానికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడున్న సిబ్బంది నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. నిజామాబాద్ వెళ్లే మార్గంలో నవీపేట్ వద్ద అంబులెన్స్ లోనే శివాని పండంటి పాపకి జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డిఎల్ఎంటి రాధాకృష్ణ తెలిపారు.