బొలెరో  ఆటో ఢీ

1,181

 

ఒక మహిళ మృతి

నలుగురికి  గాయాలు

… బాన్సువాడ ఆసుపత్రికి తరలింపు..

 బతుకమ్మ, బాన్సువాడ..

కామారెడ్డి జిల్లా నసూరుల్లాబాద్-వర్ని ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఇద్ధరికి స్వల్ప గాయాలకు గురయ్యారు. వివరాలు కి వెళ్తే మహారాష్ట్ర ప్రాంతం నాందేడ్ కు చెందిన కొంతమంది బాన్సువాడలో జరిగే శుభ కార్యక్రమానికి ఆటోలో వస్తున్నారు. బాన్సువాడ నుంచి బోలోరా వాహనం వర్నివైపు వెళుతుండగా నసూరుల్లాబాద్ శివారులో ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న ఉష (35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు, మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. నాందేడ్ జిల్లా కేంద్రంలోని విష్ణూపురి కాలని వాసులు ఈ ప్రమాధంలో గాయపడ్డారు. ఉష కుడా అదే ప్రాంతానికి చేందిన మహిళ అని తెలిసింది.నసూరుల్లాబాద్ పో లీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన రోడ్డు ప్రమాదంపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.