పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం

1,132
  • పార్టీలు మారడం ఆ రెండు పార్టీలకు అలవాటే
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : పార్టీ ఫిరాయింపులకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకమని బిజెపి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వం నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ కు వచ్చిన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో ఉన్న తమ స్వలాభం కోసం పార్టీ ఫిరాయింపులు చేస్తే తాము సమర్ధించబోమని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిఅర్ఎస్ కుటుంబ పార్టీలు ఆ పార్టీలో ఉన్న నేతలకు పార్టీలు మారడం అలవాటేనని అన్నారు. పిరాయింపుల విషయంలో అన్ని పార్టీలు రాజ్యాంగాన్ని గౌరవించాలని, చీటికిమాటికి చేతులు రాజ్యాంగాన్ని పట్టుకొని పప్పు, రాహుల్ గాంధీ ఇతర పార్టీలో నుంచి వచ్చిన నేతలను ఏ రాజ్యాంగ ప్రకారం తమ పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు మారిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టిఆర్ఎస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రజా ప్రతినిధులను ఎలా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.