బతుకమ్మ , ఆర్మూర్
ఆలూరు గ్రామానికి చెందిన నిరుపేద వంజరి కుల సోదరుడు నగేష్, వారి అమ్మ లక్ష్మి ప్రతి రోజు బిక్షటన చేస్తూ గ్రామం లోని హనుమాన్ ఆలయంలో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్ననిజామాబాదు వంజరి ట్రస్ట్ సభ్యులు మంగళవారం ఆలూరు గ్రామానికి ట్రస్ట్ అధ్యక్షులు మాస్టర్ శంకర్ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మి నారాయణ , ట్రస్ట్ సభ్యులు వెళ్లి వారితో మాట్లాడారు. నగేష్ కుటుంబ సభ్యుల కి అండగ ఉంటామన్నారు. తక్షణ సహాయంగా కొన్ని రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు, వారికి బట్టలు అందించామన్నారు. అదే విధంగా వారికీ ఉండాటనికి నివాస షెడ్డు తొందర్లోనే ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. వంజరి కులస్తులు అందరం ఒక్కతాటి పై ఉండి మన సోదరుల సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. రాబోయే రోజుల్లో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని వారన్నారు. పేద వంజరి లకు డబుల్ బెడ్ రూమ్ లో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా ఆలూరు గ్రామ సభ్యులు వంజరి ట్రస్ట్ సభ్యులని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వంజరి సంఘం అధ్యక్షులు బోనేకర్ భూమయ్య,ట్రస్ట్ సభ్యులు కరిపే రవీందర్,కాపుకర్ ఆలూరు భూమేష్, నవతే గంగాధర్, ఉప సర్పంచ్ పోతనకర్ శ్రీనివాస్ ,గోపాల్, శ్రీధర్ ,కరిపే మధుసుదన్, దాత్రిక రాజేందర్, ఆమందు విజయ్, కృష్ణసురేష్, కార్యవర్గ సభ్యులు,ఆలూరు వంజరి సంఘ సభ్యులు పాల్గొన్నారు.