- ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం
బతుకమ్మ, ఉమ్మడి జిల్లా ప్రతినిధి : స్థానికల సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది .. మరోపక్క ప్రజల వద్దకు పరిపాలన తీసుకురావాలని లక్ష్యంతో కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10 కొత్త పంచాయతీలకు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా తొమ్మిదింటికి ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల చేయాలని ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి . నూతనంగా 9 కొత్త పంచాయతీలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో, ఆ గ్రామాలలో గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వారి కల ఫలించడంతో గ్రామాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలో బీర్కూర్ మండలంలో బైరాపూర్ గ్రామపంచాయతీ నుంచి తొలగించి నూతనంగా సంబపూర్ గ్రామపంచాయతీగా ఏర్పాటయింది. నసురుల్లా బాద్ మండలంలో లింగపల్లి తండా నుంచి విడదీసి ఫకీర్ నాయక్ తాండ కొత్తగా ఏర్పాటయింది. సంగం గ్రామపంచాయతీ పరిధిలో నుంచి కొత్తగా సంగం (ఏ) పంచాయతీగా ఏర్పాటు చేశారు. మాచారెడ్డి మండలంలో సోమార్ పేట్ గ్రామపంచాయతీ లో ఉన్న సోంపేట తండాను నూతన గ్రామ పంచాయతీగా ఆమోదముద్ర ప్రభుత్వం వేసింది. అంకిరెడ్డిపల్లి తండా గ్రామపంచాయతీలో ఉన్న గుట్టి తండా ను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది.
మైసమ్మ చెరువు తండా పంచాయతీ పరిధిలోని వడ్డెర గూడెం తండాను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. నాగిరెడ్డిపేట్ మండలంలో ఆత్మకూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చిన్న ఆత్మకూర్ ను కొత్త పంచాయతీగా ఏర్పాటయింది. ధర్మారెడ్డి పంచాయతీ పరిధిలోని కన్నా రెడ్డి గ్రామాన్ని నూతన పంచాయతీగా ఏర్పాటయింది. గాంధారి మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని పిసికిలి గుట్ట తండా నూతన గ్రామపంచాయతీగా ప్రకటించింది. నూతన పంచాయతీలు ఏర్పాటు కావడం పట్ల 9 గ్రామ పంచాయతీలో గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
