బతుకమ్మ బాల్కొండ : క్రీడల్లో గెలుపోటములు సహజం..అన్నింటిని సమానంగా తీసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో జరిగిన ఉమ్మడి బాల్కొండ, ముపాకల్ , మెండోరా మండలాల పాఠశాల క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్పోర్టింగ్ స్పీరిట్ విద్యార్థుల్లో అలవాటయ్యే విధంగా తల్లుదండ్రులు కూడా మీ పిల్లలను చదువుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రోత్సహించాలి అని అన్నారు. క్రీడలు అనేవి కేవలం పీట్ నెస్ కోసమే కాదు. జీవితంలో మనకు ఎదురయ్యే దెబ్బలు తగిలినప్పుడు వాటిని ఎలా తట్టుకొని నిబ్బరముగా మనోధైర్యంగా ఉండడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డి బాల్యం చదువు మొత్తం ప్రభుత్వ పాఠశాలనే సాగిందని ఉమ్మడి బాల్కొండ మండలంతో తనకు అవినాభావ సంబంధం ఉందని కిషన్ నగర్ లో పదో తరగతి విద్యాభ్యాసం సాగిందని గుర్తు చేసుకున్నారు. ఆయన జిల్లావ్యాప్తంగా ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో పాఠశాలలకు అవసరమైన డిస్క్ బెంచ్ లు, స్పోర్ట్స్ డ్రెస్సులు, స్పోర్ట్స్ మెటీరియల్, కంప్యూటర్స్ ఇలా ఇస్తూనే వచ్చామని తెలియజేశారు జిల్లావ్యాప్తంగా 60 లక్షల పైగా పాఠశాలల్లో కావలసిన అవసరాలు తీర్చా అన్నాడు. జ్యోతి ప్రజ్వలన చేసి మండల క్రీడలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేసిన మార్చి ఫస్ట్, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. కార్యక్రమంలో వ్యాపారవేత్త దయానంద రెడ్డి, ఎంఈఓ రాజేశ్వర్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమార్ మల్లేష్ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
