యూనివర్సిటీ వీసీ లను వెంటనే నియమించాలి

1,074
  • బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్

బతుకమ్మ, తెలంగాణ యూనివర్సిటీ : రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలతో పాటు తెలంగాణ యూనివర్సిటీ కి వైస్ ఛాన్స్ లర్లను వెంటనే నియమించాలని బీజీవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బీజీవైఎమ్ ఆధ్వర్యం లో యూనివర్సిటీ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీకి వీసీ లేక యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. అకాడమిక్ వాతావరణం కుంటుపడిందని, పరిపాలన మొత్తం గాడి తప్పిందని తెలిపారు. యూనివర్సిటీకి వీసీ లను నియమిస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వానికి యూనివర్సిటీల మీద ఉన్న ప్రేమ ఏందో అర్థమవుతుందని అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు వీసీ లను నియమించి , అధిక నిధులు కేటాయించి,యూనివర్సిటీ లను బలోపేతం చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తరుణ్, నవీన్, సాయి, పవన్, అనురాగ్, ప్రమోద్, విగ్నేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.