పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

1,110

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని ధర్మోరా, శేట్ పల్లీ గ్రామాలలో దోమల నివారణకై దోమల మందు పిచికారి చేసినట్లు పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రజలకు తమ ఇండ్ల చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎటువంటి చెత్త వెయ్యకుండా, ఇండ్ల చుట్టూ మురికి నీరు నిలవకుండా, పిచ్చి మొక్కలు మొలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ధర్మోరా పంచాయితీ కార్యదర్శి అరుణ్ , కారోబర్ సాయన్న, పంచాయితీ సిబ్బంది రాజ్ కుమార్ , భూమేష్, దేవన్న, భూమన్న, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.