నిజాంసాగర్ వరద గేట్లను ఎత్తిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

1,373

బతుకమ్మ, నిజాంసాగర్ : భారీ వర్షాలతో మంజీరా నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో వరద గేట్లను ఎత్తి నీటిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర ఆగ్రస్ చైర్మన్ కాసుల బాలరాజు లు దిగువకు విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు,ప్రజాప్రతినిధులు, నాయకులతో తో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ కు పూజలు చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్న,దిగువన విడుదల అవుతున్న వరద నీటి వివరాలను పోచారం కి వివరించారు.

Pocharam Srinivas Reddy lifted the flood gates of Nizamsagar ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుందన్నారు. భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 18,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు గాను ప్రస్తుతం 1403.45 అడుగుల నీరు నిల్వ ఉందనిపూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు కాగా ప్రస్తుతం 15.9 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువన మంజీరా నదిలోకి నీటిని వదులుతున్నందున మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Pocharam Srinivas Reddy lifted the flood gates of Nizamsagar

Leave A Reply

Your email address will not be published.