ట్రావేల్ బస్ ల యాజమాన్యం కక్కూర్తి..కర్నాటకలో తెలంగాణ వాసుల ఇక్కట్లు

1,990

టాక్స్ లు ఎగ్గోట్టిన ట్రావేల్ బస్సు యాజమాన్యం

. . . కర్నాటకలో తెలంగాణ వాసుల ఇక్కట్లు

. . . నిజామాబాద్ ట్రావేల్ యాజమాన్యం నిర్వాకం

 బతుకమ్మ, నిజామాబాద్:

శనివారం తెల్లవారు జామున 4.30 ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా కర్ణాటక రాష్ట్రం  అర్టిఏ అధికారులు నాలుగు ట్రావెల్స్ బస్సు లు ఆపి టాక్స్ కట్టకుండా నడిపిస్తున్నారు అని నిలిపివేసినారు. తెలంగాణ కు చెందిన మంత్రులతో ఫోన్ చేయించిన విడిచి పెట్టలేదు. టాక్స్ ఆన్లైన్ లో కట్టిన తర్వాతనే ప్రొద్దున ఉదయం 8 గంటలకు విడిచి పెట్టారు. దీన్ని బట్టి చూస్తె ఏ ఒక్క బస్ కు కూడా  రాజకీయ పలుకుబడి ఉపయోగించి ట్యాక్స్ లేకుండా దొంగ చాటుగా నడిపిస్తున్నారని తెట తెల్లం అయింది. తెలంగాణ కు చెందిన ప్రయాణికులందరూ 4 గంటలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎసి బస్ లు,  బెంజ్ మోడల్ అంటు టూరిస్టుల వద్ధ వేల రూపాయలు టికేట్ ల రూపంలో వసూలు చేస్తు  రోడ్ ట్యాక్స్ లు కట్టకుండా రాష్ట్ర ఖజానా కు నష్టం చేస్తున్న ట్రావెల్స్ అధినేత పై తగు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. ఈ వార్త ఇప్పుడు నిజామాబాద్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కారణం అ ట్రావేల్ బస్ ల యాజమాని నిజామాబాద్ జిల్లా వాసీ , అందున ఒ పార్టి నాయకుడు కావడంతో బిఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్ లతో పోట్టు పోట్టుగా ట్రోల్ చేస్తున్నారు గులాబి కార్యకర్తలు.

Leave A Reply

Your email address will not be published.