బతుకమ్మ, నిజామాబాద్ సిటి
కలకత్తా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిస్తూ శనివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు . ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఇంచార్జి స్వామి మాట్లాడుతూ ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయిందన్నారు. యావత్ భారతావని దిగ్భాంతికి లోనయిందని, ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ బాధితురాలికి మద్దతునిస్తూ మెడికవర్ లో ఓపీ సేవలను బహిష్కరించామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కు ఇలా జరగడం దారుణాతిదారుణం .భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ దారుణకి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, వైద్యులు యజ్ఞ, సందీప్ రావు, కృష్ణ ఆదిత్య, దత్తురాజ్,వాను హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.