ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలి

1,151
  • సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు రమేష్
    బతుకమ్మ, సిరికొండ
    ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు రమేష్ డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరికొండ తూంపల్లి సొసైటీ అధికారులను నిర్లక్ష్యంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని అన్నారు. అవినీతికి అడ్డగా మారిన సొసైటీ అధికారులు డైరెక్టర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ మూడు దఫాలుగా చేసినప్పటికీ అనేక మంది రైతులకు ఇప్పటికీ రాలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి రుణమాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్, మండల నాయకులు దామోదర్, రమేష్, ఆశిష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.