సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చెద్దాం

1,143

. . . ఉద్యోగ జేఎసీ చైర్మెన్ ఆలుక కిషన్

   బతుకమ్మ, నిజామాబాద్:

ప్రతి సిపిఎస్ ఉద్యోగి తోపాటు ఓపిఎస్ ఉద్యోగులందరూ పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించేందుకు నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మన నిరసన గళం  వినిపించేలా ఉద్యోగుల హక్కుల సాధన కు పాటు పడాలని  ఉద్యోగ జేఎసీ జిల్లా చైర్మన్  అలుక  కిషన్ పిలుపు నిచ్చారు. శనివారం టిఎన్ జిఓ భవన్ లో ఎంప్లాయిస్ జేఎసీ ఆధ్వర్యంలోజిల్లా చైర్మన్  అలుక  కిషన్ అధ్యక్షతన సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కమిటీ  ఆదేశం మేరకు…. సిపిఎస్ రద్దు అంశంతో పాటు వివిధ ఇతరత్రా ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లపై నిరసన కార్యక్రమాలు నిర్వహించుటకు సన్నాహక  సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా అలుక కిషన్ మాట్లాడుతు.. సెప్టెంబర్ 1న వివిధ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ,జిల్లా కార్యవర్గ, యునిట్ ల కార్యవర్గ సభ్యులు ప్రతి ఓక్క ఉద్యోగి విద్రోహ దినం పాటించి విజయవంతం చేయాలని కోరారు.  ఈ సమావేశంలో టిజిఓ జిల్లా అధ్యక్షులు సంఘం అమృత్ కుమార్ ,రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి  టిఎన్జిఓ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , పిఆర్ టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి,  వెంకటేశ్వర్ గౌడ్ లతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.