బతుకమ్మ, భీంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను భీంగల్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. రాజధానిలోని ఆయన స్వగృహంలో కలిసి పుష్ప గుచాన్ని ఇచ్చి, శాలువతో సత్కరించారు. మహేష్ గౌడ్ కు యూత్ కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ నాయకులు దైడి సురేష్, మహ్మద్ అబ్దుల్ జుబేర్, సయ్యద్ నవీద్, జిషన్, ఆధానన్ లు పాల్గొన్నారు.