గెస్ట్ హౌస్ పై పోలీసుల దాడి
. . పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్
. . . అంతా యుపిఏ చెల్లింపులు
.. పట్టుబడ్డ వారిలో నాయకులు, వ్యాపారులు
బతుకమ్మ కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి శివారులోని ఉప్పర్ పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న గెస్ట్ హౌస్ పై మంగళవారం రాత్రి పోలీసులు దాడి చేశారు.ముందస్తు అందిన సమాచారం మేరకు ఎస్ఐ సాయికుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు పేకాట ఆడుతున్న గెస్ట్ హౌస్ ను చుట్టుముట్టి పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 13760 నగదు ను 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన వారితోపాటు, కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖులు ఉన్నారు. వారిలో ప్రభుత్వ సలహదారు షబ్బిర్ అలీ అనుచరుడు, ఓక బిఆర్ఎస్ నాయకుడు, వ్యాపారులు ఉన్నారు. పత్తలాట అడుతు ప్రముఖులు పట్టుబడితే వారివద్ధ దోరికిన నగధును చూసి పోలిస్ లు షాక్ కు గురయ్యారు. కాని వారు యూపిఎ చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు పది మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.