- హామీలు నిలుపుకోలేకే అబద్దపు ఆరోపణలు
- అన్ని హామీల అమలుపై అబద్దపు ప్రచారమే
- చర్చకు సిద్ధం వేదిక నిర్ణయించండని సవాల్
- బీయర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ నగధర్ రెడ్డి
బతుకమ్మ, భీంగల్ : ఎన్నికల్లో సాధ్యం కానీ హామీలానిచ్చి నిలుపుకోలేక, హామీ అమలు కాని రైతులు ధర్నా చేస్తే ఆ రైతుల ధర్నాను దొంగ ధర్నా అనడం సునీల్ కుమార్ అవివేకమని నిదర్శనమని బీయర్ఎస్ వేల్పూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ జె. నగదర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం వేల్పూర్ మండల కేంద్రం లోని పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎన్నికల్లో రైతులందరికి మాఫీ చేస్తామన్నా పంట ఋణం అందరికి మాఫీ కాకా పోవడంతో రైతులు బీయర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రోడ్డు ఎక్కి ధర్నా చేసారన్నారు. ఆ రైతుల ధర్నాను దొంగ ధర్నా అని వ్యాఖ్యనించడం కాంగ్రెస్ కానిస్టేన్సీ ఇంచార్జ్ సునీల్ కుమార్ బుద్ధి ఏపాటిది రైతులకు అర్థమయ్యిందన్నారు. ఏక కాలంలో రూ. 2 లక్షల వరకు రైతు ఋణమాఫీ చేస్తామని చెప్పిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎందరికి రుణమాఫీ చేసిందని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అందరికి జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకలు చేసుకోవడం విడ్డురంగా ఉందని అన్నారు. కానస్టెన్సీ మొత్తం తీసుకొంటే 8 మండలాల్లో ఏయే ఊరు తీసుకొన్నారు కనీసం సగం మంది రైతులకు కూడా ఇప్పటికి రుణమాఫీ కాలేదన్నారు. ఇందులో భాగంగా వేల్పూర్ మండలాన్ని తీసుకొంటే మూడు దాఫల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఋణమాఫీ చేస్తే ఇప్పటికి కేవలం 2632 మంది రైతులకు మాత్రమే ఋణ విముక్తి కలిగిందని ఆయన అన్నారు. ఇంకా 8584 మందికి ఋణమాఫీ కావాల్సింది ఉందన్నారు. ఆగష్టు 15 లోపు అందరికి ఋణమాఫీ చేస్తామని అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ ప్రస్తుత సీ.ఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ పై ఒట్టు పెట్టి హామీయిచ్చారన్నరని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికి సగం మందికి కూడా ఋణమాఫీ కాలేదని, మీ కాంగ్రెస్ పార్టీకీ చెందిన వారందరికి రుణమాఫీ అయ్యిందా అని ప్రశ్నించారు . ఋణమాఫీ పై రైతులకు కోర్రిలు పెట్టి ఆపుతున్నారని, ఇప్పటికి రైతులకు చేసిన రుణమాఫీ పైసలాన్ని ఆ రైతుల రైతు బందు పైసలేనని ఆయన ఏద్దేవా చేశారు. చారణ కోడికి భారణ మసాలా అన్నట్లు అబద్దాలు, అర్బఠాలు మీరు చేస్తూ బీయర్ఎస్ పార్టీని నిందించడం సునీల్ చెత్తగాని తనానికి నిదర్శనం అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అమలు చేసిని ఆరు గ్యారంటీలు, పదమూడు హామీల తో పాటు రైతు ఋణమాఫీ పై కానస్టెన్సీలో ఏ గ్రామాన్ని తీసుకొన్నా చర్చకు మేం సిద్దమని దానికి వేదికను మీరే నిర్ణహించాలని ఆయన సవాల్ విసిరారు.రైతు రుణమాఫీ అందరు రైతులకు చెయ్యాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, అందుకే కోర్రిలతో కొందరికి మాఫీ చేసి కొందరిది ఎగ్గొద్దామని చూస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే బేషరత్ గా అందరు రైతులకు రుణమాఫీ చెయ్యాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.లేని పక్షనా రైతు పక్షనా బీయర్ఎస్ పార్టీ ఆందోళనలను ఉదృతం చేస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో బీయర్ఎస్ మండల నాయకులు రేగుల్ల రాములు,నీరటి భాగ్య,మహిపాల్,దత్తు తదితరులు పాల్గొన్నారు.