
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మంద మకరందు శుక్రవారం తెల్లవారుజామున నగరంలో తనిఖీలు నిర్వహించారు. వివిధ డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన.. శానిటేషన్ పనులను పక్కాగా చేపట్టాలని, విష జ్వరాలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు చెత్తను తరలించాలని సూచించారు. పనుల్లో ప్రత్యేక చొరవ చూపుతూ, నగర పాలక సంస్థకు మచ్చ తేకుండా ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. వెంటనే పరిష్కరించాలని, సంబంధిత సమస్యను వెంటనే తనకు తెలుపాలని అన్నారు.