బతుకమ్మ మోర్తాడ్ : ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్ బంద్ లో భాగంగా మోర్తాడ్ మండలంలోని సుంకేట్, శెట్ పల్లి, డొంకల్ మాల సంఘాలు మద్దతును ఇచ్చారు. గ్రామాల్లోని కిరాణా షాపులను, ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ర్యాలీ నిర్వహిస్తూ రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు సొక్కం శ్యామ్, తుమ్మల గోపి, బక్కూరి పోతలింగం, తలారి సుశాంత్, బక్కురి ప్రశాంత్, జిన్నా సునీల్, బక్కురి శ్రావణ్, అక్షయ్, ప్రణీత్, విజయ్, సుధీర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు