వ్యవసాయ భూముల్లో అక్రమ వెంచర్లు

1,074
  • పొలానికి దారి ఇవ్వడం లేదంటూ తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన రైతు

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల వెలుస్తున్నాయి. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. మండల కేంద్రానికి ఒక కిలోమీటర్ పరిధిలో లో ఉన్న వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి రియల్ మాఫియా పొలం ప్లాట్లుగా మార్చి ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు జరుపుతూ ప్రజలను మోసం చేయాలని చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ శివారులోని కందర్ పల్లి వద్ద గల 161 జాతీయ రహదారి పక్కన సర్వే నెంబర్ 1005లో ఒక ఎకరం పై చిలుకు వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి గజానికి వేల రూపాయల చొప్పున అమ్మకాలు జరిపేలా ప్రణాళికలు రచిస్తున్నారని రైతు సాయిని అశోక్ s/o ఈరన్న బుధవారం రోజున తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు 1005పక్కన గల సర్వే నంబర్1004 పంట భూమిలోకి వెళ్లాలంటే తన పంట పొలానికి దారి ఇవ్వకుండా అక్రమ వెంచర్ నిర్మిస్తూ తన వ్యవసాయ పనులకు ఇబ్బందులను కలిగిస్తున్నారని బిచ్కుంద తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు కాగా అక్రమంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లో ఇప్పటికే అందులో ఏలాంటి అనుమతులు లేకుండా ప్లాట్ల అమ్మకాలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది బిచ్కుంద మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరం, 161 జాతీయ రహదారికి కేవలం వందల మీటర్ల దూరంలో ఉండటంతో ఇక్కడ ఉన్న భూములకు ధరలు అమాంతం పెరిగిపోయాయి.

దీంతో రియల్ మాఫియా దారులు కందర్ పల్లి గ్రామ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములను టార్గెట్ చేసుకొని వెంచర్లు ఏర్పాటు చేసి వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పంట పొలాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. రియల్ వ్యాపారం లో తెల్ల చొక్కా ఖద్దరు బట్టలు ధరించిన నాయకులు రాజకీయ పలుకుబడితో ఇలాంటి దందాకు తెరలేపుతున్నారు. కొనుగోలుదారులు భవిష్యత్తులో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే వారు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి అక్రమ వెంచర్లు లను పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బిచ్కుంద పట్టణ శివారులో అక్రమ వెంచర్లు..
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ శివారులో కందర్ పల్లి గ్రామ సమీపాన ఎకరానికి పైచిలుకు విస్తీర్ణంలో వెంచర్ ను ఏర్పాటు చేశారు. వెంచర్ నిర్వాహకుడి కి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం పంచాయితి అధికారుల అండదండలతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. నాలా కన్వెన్షన్ సరైన రోడ్డు నిర్మాణం విద్యుత్ సౌకర్యం లేకుండానే కొనుగోలుదారులకు ప్లాట్లుగా ఏర్పాటు చేసి విక్రయించ చూస్తున్నారని అలాగే తన వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా పూర్తిగా దారిని మూసివేసారని తన పొలంలోకి తనకే వెళ్లకుండా చేశారని రైతు సాయిని అశోక్ బిచ్కుంద ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారు కాగా ఈ తతంగమంతా పంచాయతీ శాఖ కనుసన్నల్లో జరుగుతుందని పలువురు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. . పట్టా భూములు ఏర్పాటు చేయాలంటే వ్యవసాయ భూములుగా, పారిశ్రామిక ప్రాంతాలు గా ఉండకూడదు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం..

వ్యవసాయ భూములను వెంచర్లుగా ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదట వాటిని నివాస స్థలాలు గా మార్చుకోవాలి.రుసుము చేల్లించి నాలా కన్వెన్షన్ తో పాటుగా పంచాయతీ నుండి లే అవుట్ అనుమతి పొందాలి..అంతర్గత రోడ్ల వెడల్పు 33 సీట్లు ఉండాలి.ఇవేమీ లేకుండా నే వెంచర్ నిర్వహకులు ప్లాట్లను విక్రయించ చూడడం గమనార్హం..

భవిష్యత్తులో వినియోగదారులకు తప్పని తిప్పలు..

పేదలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుతో భవిష్యత్తులో తమ పిల్లల అవసరాల కోసం లక్షల రూపాయలు వెచ్చించి ఫ్లాట్ లను కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వెంచర్ నిర్వాహకులు అమాయక పేద ప్రజలకు ఎలాంటి అనుమతులు లేని ప్లాట్లును అమ్ముతూ మోసం చేస్తున్నారు. భవిష్యత్తులో తాము కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే వారు ముప్పుతిప్పలు పడాల్సిందే, ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ నిర్లక్ష్యం తో ఉంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.