బతుకమ్మ, ధర్పల్లి : దర్పల్లి మండలంలోని గోవింద్ పల్లి గ్రామంలో సోమవారం ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు డిఏంఓ తెలిపారు. గోవింద్ పల్లి గ్రామంలో 11 డెంగ్యూ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని గ్రామస్థులకు అవగాహన కల్పించామన్నారు. విడిసీ సభ్యులతో, పంచాయతీ కార్యదర్శి తో సమావేశం నిర్వించామని తెలిపారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ డా.మౌనిక, స్థానిక సూపర్వైజర్, ఏ ఏ యం లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
