- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
బతుకమ్మ, జుక్కల్ : బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామంలో “స్వచ్ఛదనం – పచ్చదనం” కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బుధవారం మొక్కలు నాటారు. ఈ’ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని చెట్టు– ప్రగతి మెట్టు అని, స్వచ్ఛదనం- పచ్చదనం అన్నారు.
పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, వ్యతిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం, సీజనల్ వ్యాధులు మొదలగు వాటిపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు.గ్రామంలో హనుమాన్ మందిరాన్ని దర్శించుకున్నారు.
ఈ బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు చిన్నారులు తదితరులు అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
