- ఉదారతను చాటుకున్నమాజీ ఎంపీపీ
బతుకమ్మ, మాచారెడ్డి: మాచారెడ్డి మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఆడ బిడ్డ వివాహానికి మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు ఆర్థిక సహాయం అందించి తన ఉదారత ను చాటుకున్నారు. గ్రామానికి చెందిన కొండ దేవలక్ష్మి కుమార్తె వైష్ణవి వివాహానికి 20వేల నగదు అందించారు. తండ్రి లేని అమ్మాయి పెళ్ళి కి ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న నర్సింగరావు కు అమ్మాయి తల్లితో పాటు బంధువులు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి, కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రామ్మోహన్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.