బతుకమ్మ,మెండోరా : మెండోరా గ్రామానికి చెందిన కమ్మరి దత్తు సోమవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అoత్యక్రియల కోసం వారి కుటుంబ సభ్యులకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు గుండోజి రవి, సొసైటీ వైస్ చైర్మన్ నోముల శ్రీనివాస్, మోతె గంగారెడ్డి, డీ సీ గంగయ్య, బద్దం అశోక్, మౌలానా, గుర్రం గంగాధర్, బెల్లం మధు తదితరులు పాల్గొన్నారు.