ప్రతి బిజెపి కార్యకర్త సైనికునిలా పనిచేయాలి

1,470
  • బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజెపి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంస్థ గత నిర్మాణంలో భాగంగా సెప్టెంబరు ఒకటి నుంచి 25వ తేదీ వరకు మొదటి విడత సభ్యత్వం నమోదు అక్టోబర్ 1 నుంచి 25 వరకు రెండో విడత సభ్యత్వం నమోదు ప్రారంభం కావడం జరుగుతుందని, ఈ సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Every BJP worker should work like a soldierఆగస్టు 26 నుండి 30 వరకు మండలస్థాయి కార్యశాలలు, ఆగస్టు 31న పోలింగ్ బూత్ స్థాయి కార్యశాల నిర్వహించాలన్నారు. 8800002024 ఈ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు. దేశంలో అత్యధికంగా సభ్యతాలు ఉన్న పార్టీ బీజేపీ, బిజెపి పార్టీ పొలింగ్ బూత్ స్థాయి నుండి మరింత బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం ఎంతో కీలకం అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి కచ్చితంగా 200 వరకు సభ్యత్వం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పల్లె గంగారెడ్డి గారు. పెద్దొళ్ళ గంగారెడ్డి. న్యాలం రాజు. పొతన్ కార్ లక్ష్మీనారాయణ. గద్దె భూమన్న. శివరాజ్ కుమార్. మేక సంతోష్. శివప్రసాద్. అసెంబ్లీ కన్వీనర్లు మండల అధ్యక్షులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Every BJP worker should work like a soldier

Leave A Reply

Your email address will not be published.