బతుకమ్మ, ఆర్మూర్ : భారతీయ జనతా పార్టీ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు స్వతంత్ర సమరయోధులు ఏలేటి శ్యాంసుందర్ రెడ్డి స్వగృహానికి వెళ్లి వారికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలేటి శ్యాంసుందర్ రెడ్డి (95) ని మరియు వీరి సతీమణి అయిన భారతి ను సన్మానించడమైనది. ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, ఉపాధ్యక్షులు దొండి ప్రకాష్, కార్యదర్శి మిర్యాల్కర్ కిరణ్, ఓబిసి మోర్చ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్సింగ్ నాయక్, బారడ్ వినోద్ మరియు తోగర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.