బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మీడియాతో ఈ నెల 22 నుంచి 24 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. నగరంలోని గాజులు పేటకు చెందిన గంగపుత్ర నగర యూత్ అధ్యక్షుడు అర్బన్ పల్లికొండ సునీ ల్ ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకొని జిల్లా జడ్జి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఈ శిక్షణ వల్ల తాము చాలా నేర్చుకున్నామన్నారు. వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.