నాగిరెడ్డిపేటలో బంద్ ప్రశాంతం

1,260

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల పిలుపు మేరకు శుక్రవారం మండల కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మండల కేంద్రంలో హిందూ సంఘాల ప్రజా ప్రతినిధులు పెట్రోల్ బంక్ నుండి తహాశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు, ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు శ్రీకాంత్, మాజీ అధ్యక్షుడు మ్యాకల హన్మండ్లు, నాయకులు గంపల వెంకన్న, బోయిని కృష్ణ, శివకుమార్ గౌడ్, భూపతి రాజు, సంతోష్, నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.