చోరీ సొత్తు ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
బతుకమ్మ, నిజామాబాద్ క్రైo : రైల్వే స్టేషన్ లో నిలిచిన రైల్ బోగీలలో ప్రయాణికుల బ్యాగులు , ఆభరణాలు దొంగలిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని ఉప్పల్ కు చెందిన మహమ్మద్ సలీం కృష్ణ ఎక్స్ప్రెస్ లో తన భార్యతో కలిసి అదిలాబాద్ వెళ్తున్నాడు . సోమవారం తెల్లవారుజామున నిజామబాద్ రైల్వేస్టేషన్ లో కృష్ణ ఎక్స్ప్రెస్ ఆగినప్పుడు అతని భార్య కు సంబంధించిన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితులు ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఒక వ్యక్తి ప్లాట్ఫామ్ పైకి రాగా అతనిని డ్యూటీ లో ఉన్న సిబ్బంది అతనిని అనుమానించి పట్టుకొని విచారించరు. అతని పేరు ఎంబ సునీల్ ( 25 ) లేబరు పనిచేస్తూ ఎడపల్లి మండలం జానకంపేట గ అని తెలిపారు . ఉదయం కృష్ణ ఎక్స్ప్రెస్ లో బ్యాగు దొంగతనం చేశాను మరల తిరిగి సాయంత్రం వచ్చే ట్రైన్ లో అదేవిధంగా దొంగతనం చేద్దామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చినానని విచారణలో ఒప్పుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున బ్యాగ్ దొంగిలించిన దాంట్లో నుండి తన వద్ద ఉన్న రెండు గ్రాముల కమ్మలు , 7 తులాల సిల్వర్ చేయను , నాలుగు రింగులు ఇవే నని తను చేసిన దొంగ తనాన్ని ఒప్పుకొని తన వద్ద ఉన్న దొంగ సొత్తు ను ఇవ్వడం జరిగినది. వెంటనే అతనిని కస్టడీ లో కి తీసుకొని అరెస్టు చేయడం జరిగిందని రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు.