పాపన్న జయంతి బహుమతిగా కామారెడ్డి  బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి

552

. . .అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ

 

బతుకమ్మ నిజామాబాద్ సిటీ..

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లి ఎన్నికల సమయం ఇచ్చిన హమీ మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సంధర్బంగా కామారెడ్డిలో ప్రకటించిన బిసి డిక్లరేషన్ ను అమలు చేయాలని న్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ కోరారు.  అదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్బంగా నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ హునుమాన్ జంక్షన్ లో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాల  వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణ పౌరుషనికి ప్రతీక అయినా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్బంగా ఇందూర్ గౌడ,బహుజనులందరికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గడ్డలోనే తిరుగుబాటు పౌరుషం ఉందని ఆనాడు తురుష్కలు,మెుఘల్లు నిజాం సర్కార్ తో పాటు పెత్తందారుల నిరంకుశ పాలనను అంతమోందించె లక్ష్యంతో పుట్టిన ఓరుగల్లు ముద్దుబిడ్డ బహుజన రాజు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు. ఊర్లను, పల్లెను కొడితే ఏమి ఫలం అని కొడితే గోల్కొండ ఖిల్లాను కొట్టాలని 17వ శతబ్దంలో  గోల్కొండ ఖిల్లాను గెలిచిన నాయకుడు సర్దార్ పాపన్న అని కోనియాడారు.          కల్లు గిసుకునే వృత్తిలో జన్మించి నిరంకుశ పాలనకు ఎదురు తిరిగి ప్రజలను చైతన్యం చేస్తూ గేరిళ్ల యుద్ధ నైపుణ్యలతో భువనగిరి కోట, గోల్కొండ కోట మొదలైన వాటిని జయించడం  జరిగిందని సర్ధార్ పాపన్న స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజం బడుగు బలహీన వర్గాలు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు., ఆయన జయంతికి బహుమతిగా ముఖ్యమంత్రి రేవంత్,కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసి రిజర్వేషన్ 42 శాతం కి పెంచి బహుజనులను రాజకీయంగా ముందుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు, గీత కార్మికులు ,గౌడ సంఘం సభ్యులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.