డిపాల్ట్ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తిసుకున్న ఎమ్మెల్సీ కవిత

             బతుకమ్మ న్యూస్, చీఫ్ బ్యూరో

డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తిసుకున్నారు. డిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బుదవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉండగా కవిత మంగళవారం తన పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం అసక్తి కరంగా మారింది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పై సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన కేసులో పదే పదే వాయిదాలు కోరడంతో న్యాయమూర్తి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కవిత తరుపును డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఈ నెల 5 న హజరు కాకపోవడం, బుదవారం హజరయ్యే అవకాశాలు లేవని పిటిషన్ పై విచారణ వాయిదా వేయాలి కోరడంతో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు. ఇద వరకే బెయిల్ పిటిషన్ పై రెండు సార్లు అనుమతిచ్చామని, వాదానలు వినిపించకపోతే పిటిషన్ వేనక్కి తీసుకోవాలని జడ్జీ కోరడంతో కల్వకుంట్ల కవిత తన పిటిషన్ ను వాపసు తీసుకున్నారు.

Comments (0)
Add Comment