శ్రీరాం సాగర్ లో 80 టియంసీల నీరు
. . .16 గేట్ల ఎత్తి 49 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుధల
బతుకమ్మ, మెండోరా:
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు లో 80.053 టియంసీల నీరు ఉంది. ప్రాజెక్టుఎగువ భాగంలో కురిసిన వర్షం, మంజీరా ద్వార వస్తున్న వరధ తో ప్రాజెక్టు42 గేట్లకు గాను 16 వరధ గేట్లను ఎత్తారు. ప్రాజెక్టుకు 52,013 క్యూసెక్కుల వరధ వస్తుండటంతో అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజేక్టు సామార్ధ్యం 1091 అడుగులు కాగా 1090 అడుగుల నీటితో ప్రాజెక్టు నిండడంతో శనివారం రాత్రి గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులో ఈ సీజన్ లో ఇది రెండవసారి గేట్లు ఎత్తడం. గత వారం వరకు ఇన్ ప్లో అధారంగా 41 గేట్లను ఎత్తి రెండున్నర లక్షల క్యూసెక్కులయ నీటిని గోదావరిలోకి వదిలారు. ఎస్ఆర్ ఎస్ పి ప్రాజెక్టునుంచి జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 82.706 టియంసీల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టుకు155.238 టియంసీల ఇన్ ప్లో వచ్చింది.