ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • కామారెడ్డి ఎంఎల్ఏ వెంకట రమణా రెడ్డి

బతుకమ్మ, కామారెడ్డి : వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి ఎంఎల్ఏ వెంకట రమణా రెడ్డి సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటు లో ఉండాలన్నారు. విద్యుత్ సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరం ఉంటేనే బయటికి రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని కోరారు.

People in flooded areas should be alert
Comments (0)
Add Comment