- లేదంటే పాత కమ్మర్ పల్లె కావాలి
- మానాలలో మళ్ళీ ఉద్యమ సెగలు
బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి : ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆ గ్రామం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజన్నసిరిసిల్లా జిల్లాలో కలిపారు. సంబంధిత గ్రామం కమ్మర్ పల్లి మండల కేంద్రానికి 60 కిలో మీటర్ల దూరంలో ఉందన్న కారణంతో దానిని రాజన్నసిరిసిల్లాలో కలిపి అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన రుద్రంగి మండలంలో కలిపారు. కానీ ఆ సంబురం మూణాళ్ళ ముచ్చటగానే మారింది. ఇప్పుడు ఆ గ్రామమే కొత్తగా తాండలను పంచాయితీలు చేయడంతో తమ గ్రామాన్నే మండలంగా చేయాలని లేకపోతే గతంలో మాదిరిగా కమ్మర్ పల్లి మండలంలో కలుపాలన్న డిమాండ్ ను ఎత్తుకుంది అదే మానాల గ్రామం.
పరిపాలన సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి మండలం పరిధిలో ఉన్న మానాల గ్రామాన్ని రాజన్న సిరిసిల్లా జిల్లాలో నూతంగా ఏర్పాటైన రుద్రంగి మండలంలోకి కలిపారు. నిత్యావసరాలు, వ్యాపార, వాణిజ్యల రీత్యా గతంలో నుండి మానాల వాసుల రవాణా అంతా రుద్రంగి వైపే ఉండేది. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం ఆసియా ఖండంలోనే రెండవదైనా అతి పెద్ద మహిళ అమరవీరుల స్తూపం (పీపుల్స్ వార్) ఉంది.అన్నలకు కంచుకోటగా పేరొందిన మానాల గ్రామాన్ని రుద్రంగిలో కలుపడాన్ని స్థానికులు హర్షం వ్యక్తం చేసి,అప్పటి ముఖ్యమంత్రి కెసీఆర్ఐటీ మంత్రి కేటీఆర్ ల చిత్రపటాలకు పాలాభిషేకలు చేసిన మాట జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని చెగించుకోగా ప్రభుత్వం మారిన తరుణంలో మానాల వాసులు ఉన్నటుండి మాకు రుద్రంగి మండలం వద్దు మా మానాలనే ముద్దు మండలంగా మార్చాలని పట్టుబడుతున్నారు. అప్పుడు రుద్రంగి మండలంలో కల్పడంతో అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేసి ఇప్పుడు మండలం రుద్రంగి వద్దు అనడంలో గ్రామస్థుల ఆంతర్యామేమిటో తెలియడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని వెనుక బలమైన రాజకీయ ఎత్తుగడ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడు బాల్కొండ ఎమ్మెల్యేఅప్పటి ఉమ్మడి జిల్లాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మనసారా ఇష్టం లేకున్నా మానాలవాసుల అభీష్టం మేరకే మండల మార్పు జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. మానాల గ్రామ వాసుల సౌలభ్యం కోసమే కొత్తగా రుద్రంగిని మండలం చేసిమానాల గ్రామ పరిధిని 16 తండాలను 8 గ్రామ పంచాయతీలుగా చేసికొత్త మండలం ఏర్పాటు చేసారని వారు చెబుతున్నారు. ఈ దృష్టితోనే అప్పుడు కొత్త మండల ఏర్పాటుకై మానాల గ్రామ పంచాయతీతో పాటు కొత్తగా తాండ జీ. పీ లు ఎనిమిదిటిని ఏర్పాటు చేసి వాటిని కలిపె రుద్రంగిని కొత్త మండలం చేశారని చెబుతున్నారు.