ఎవరు ఈ దారిన వెళ్లకూడదు

బతుకమ్మ,మోర్తాడ్ : మోర్తాడ్ మండలంలోని ధర్మోరా, పాలెం గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యాం పై వరద నీరు పొంగిపొర్లుతూ ప్రవాహం ఎక్కువ రావడంతో ఎవరు ఆ రోడ్డుపైన వెళ్ళకూడదు అని ఎస్సై విక్రమ్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరు ఆ దారిన వెళ్లకూడదని ఆయన పేర్కొన్నారు. ఉదయం ట్రాలీ ఆటో ఇరుక్కు పోవడంతో స్థానికులు జే సీ బీ సహాయంతో సురక్షితంగా బయటికి తేవడంతో గ్రామస్తులను ఎస్సై అభినందించారు. ఆయన వెంట స్థానికులు సృజన్ తదితరులు ఉన్నారు.

No one should go this way
Comments (0)
Add Comment