- బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజెపి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంస్థ గత నిర్మాణంలో భాగంగా సెప్టెంబరు ఒకటి నుంచి 25వ తేదీ వరకు మొదటి విడత సభ్యత్వం నమోదు అక్టోబర్ 1 నుంచి 25 వరకు రెండో విడత సభ్యత్వం నమోదు ప్రారంభం కావడం జరుగుతుందని, ఈ సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.