- కంపుకొడుతున్న టాయిలెట్స్ పై చైర్మన్ ఆగ్రహం
- పాఠశాలలో రిజిస్టర్స్, ఇతర తనిఖీలకు అడ్డు పడ్డ నిర్వాహకులు
బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవుని పల్లి రోడ్డులో గల జీవదాన్ హైస్కూల్ ను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ సుజాత, సిబ్బంది తో కలిసి ఆకస్మికంగా తనిఖీల నిమిత్తం వెళ్లారు. శుక్రవారం జీవదాన్ పాఠశాలకు అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లిన సమయంలో పలు విషయాలు బహిర్గతం కావడంతో మునిసిపల్ చైర్మన్ గడ్డం ఇండప్రియ, కమిషనర్ లు యాజమాన్యం తిరుపై అగ్రహం వ్యక్తం చేశారు. జీవదాన్ పాఠశాలలో ఉపాధ్యాయుల,, సిబ్బందికి సంబందించిన బాత్ రూమ్స్, టాయిలెట్స్ సక్రమంగా ఉండగా విద్యార్థులకు సంబందించిన టాయిలెట్స్ మురికి కూపంగా, దుర్గంగద భరీతంగా ఉండటంపై మున్సిపల్ చైర్మన్ యాజమాన్యంపై అగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్ ఇలాగే ఉంచుతారా అంటూ అసహనం వ్యక్తం చేసి వెంటనే బాత్ రూమ్స్, టాయిలెట్స్ క్లినింగ్ చేయించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.