అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ బి.కేశవులు
నిజామాబాద్, బతుకమ్మ : హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) విభాగాన్ని ప్రస్తుతానికి హెచ్ఎండీఏకే వర్తింపజేస్తున్నట్లుగానే భారీగా కబ్జాలకు గురవుతున్న నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, పార్కులను కాపాడటానికి జిల్లాలో కూడ ” హైడ్రా ” తరహాలోనే ” నిడ్రా” ను ఏర్పాటు చేయాలని తెలంగాణ మేధావుల సంఘం ఛైర్మన్ డాక్టర్ బి కేశవులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ నగరం లోని ఖలీల్ వాడి లో గల డాక్టర్ కేశవులు హాస్పిటల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ” జిల్లాలో చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలు – నిడ్రా ఏర్పాటు ” అంశంపై జరిగిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి కేశవులు హాజరై ప్రసంగించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ఫూలాంగ్ వాగుతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్ గల్, డిచ్ పల్లి ప్రాంతాల్లోని చెరువుల శిఖాలు, నిజాంసాగర్ కాల్వ కట్టల వద్ద కబ్జాలపై గతంలోనే ఫిర్యాదులు వచ్చినప్పటికి అధికారులు పట్టించుకోక పొవడం దారుణమని, నగర శివారులోని నిజామాబాద్- బోధన్ రహదారి పక్కనే రామర్తి చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు కాగా ప్రస్తుతం 15 ఎకరాలు కూడ లేదని, భీమ్ గల్ లో దాదాపు 73 ఎకరాల విస్తీర్ణంలోని రాథం చెరువు శిఖం ప్రాంతం 10 ఎకరాలకు మించి ఆక్రమణలను గురైందని, మొగిలి చెరువు, ధర్మారాయుడి కుంట ఆక్రమణలపై కూడ ఫిర్యాదులున్నాయని డాక్టర్ కేశవులు వివరించారు.అలాగే జిల్లాలో చెరువు శిఖాలు, కాల్వల బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతుంటే నీటిపారుదలశాఖ , మునిసిపల్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని డాక్టర్ కేశవులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జర్నలిసు్్టలు, నాయకులు, మేధావులు పాల్గొన్నారు.