ప్రమాదాల బారిన పడకుండా..?

  • నిరాశతో వెను తిరుగుతున్న పర్యాటకులు

బతుకమ్మ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్( మోర్తాడ్):  జాతీయ రహదారి పోచంపాడ్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు భారీ బందో బస్తు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాలను వరద వచ్చి చేరడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 41 గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులుతున్న విషయం తెలిసిందే. విషయాన్ని తెలుసుకున్న పర్యాటకులు స్థానిక నిజామాబాద్ జిల్లా వాసులే కాకుండా పక్క జిల్లాలైనటువంటి నిర్మల్, కోరుట్ల, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. నీటి అందాలను తిలకించడానికి వచ్చే పర్యాటకులను అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు జాతీయ రహదారి పైన ఆపేస్తున్నారు. లక్ష్మీ కాల్వ రోడ్డు పై నుండి కూడా రాకుండా అడ్డుగా ముండ్లకంచ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు అందాలు, జలదృశ్యాలను చూస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాల బారిన పడవచ్చని గ్రహించిన అధికారులు పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు. స్థానిక జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వస్తున్న పర్యాటకులు నిరాశతో వెను తిరుగుతున్నారు.

Without being affected by accidents..?
Comments (0)
Add Comment