గిరిజనులకు హక్కులు దక్కేదిఎప్పుడు…?

  • కామారెడ్డి జిల్లా ఎల్ పీ హెచ్ ఎస్ అధ్యక్షులు గణేష్ నాయక్
    బతుకమ్మ, మాచారెడ్డి:
    ఊహించని వేగంతో దూసుకు వస్తున్న కార్పొరేట్ శక్తులకు సాగిలబడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వల్ల అడవులు, గుట్టలు మాయమై పోతున్నాయి. ఇక అడవులు, అక్కడి భూములు, ప్రకృతి పై గిరిజనులకు హక్కులు దక్కేదెప్పుడని కామారెడ్డి జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ ప్రశ్నించారు. ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడారు. ఆదివాసీల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపిన సంవత్సరం ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం 1994లో ఐక్య రాజ్య సమితి ఆగస్టు 9న ప్రపంచ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం గా ప్రకటించింది. ఆదివాసీల హక్కుల కోసం ఎన్నో రకాల ఉద్యమాలు చేసి అమరులైన కుటుంబాలకు జోహార్లు తెలిపారు . మహనీయుల బాటలో వారి సిద్ధాంతాలు ఆశయ సాధనలో అడుగుజాడలో యువత నడవాలని కోరారు. అడవిపైన ఆదివాసీలదే హక్కు.గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్ట బెట్టడాన్ని వ్యతిరేకించాలి.విదేశీ కార్పొరేటర్లకు ఐదు శాతం పన్ను రాయితీ విరమించాలి. వ్యవసాయంమ బడ్జెట్ రైతులకు అనుకూలంగా సమరించాలి. వ్యవసాయ పరిశోధనలకు అమెజాన్ సిన్ జేంట్. బేయర్ తో ఐసిఆర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ ఆయన చేశారు.
When did the tribals get their rights?
Comments (0)
Add Comment