- త్వరలోనే బదిలీలపై పూర్తిస్థాయి ఉద్యోగులు వచ్చే అవకాశం
- ఏ ఉద్యోగి అవినీతి పాల్పడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం..
- బతుకమ్మతో మున్సిపల్ కమిషనర్ మంద మకరంద
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న, ఔట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సిద్ధం చేసి పంపించామని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ఉద్యోగులుగా కొనసాగుతున్న ఔట్సోర్సింగ్, ఉద్యోగుల వివరాలు, ప్రతిరోజు డంపింగ్ యార్డ్ కు తరలించే చెత్త వివరాలు, అదేవిధంగా ఇటీవల ఏసీబీ వలలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రెవిన్యూ అధికారి నరేందర్ వ్యవహారంపై బతుకమ్మ మున్సిపల్ కమిషనర్ ను ఆరా తీయగా వివరాలు తెలిపారు. ప్రతిరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ పరిధిలో ఉన్న డ్రైనేజ్ క్లీనింగ్ ల కొరకు ప్రతిరోజు 285 కిలోమీటర్ల పొడవున శుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను చెత్త తరలింపునకు ట్రాక్టర్లు-32, టిప్పర్స్ -09, టాటా ఏసీ ట్రాలీ ఆటోలు-67, కంపక్టర్లు-03 వివిధ డివిజన్ పరిధిలో చెత్త సేకరణ కు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇందులో రెగ్యులర్ డ్రైవర్లు కేవలం ఒక్కరే ఉండడం విశేషం. అయితే ఔట్సోర్సింగ్ డ్రైవర్లు 125 మంది కొనసాగుతున్నరని ఆయన వివరించారు. ఐతే ఆయా డివిజన్లో ప్రతిరోజు చెత్త సేకరణ లో భాగంగా చెత్త తరలించే క్రమంలో చెత్త వాహనాలకు రాష్ట్రంలో నే మొట్టమొదటిసారిగా జిపిఎస్ విధానాన్ని వాహనాలకు అమర్చి ప్రతిరోజు చెత్త సేకరణ సక్రమంగా జరుగుతుందా లేదా అనేది తనకు క్షణాల్లో జిపిఎస్ విధానం ద్వారా తెలిసిపోతుందని తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒక వాహనానికి జిపిఎస్ సిస్టంను అమర్చినట్లు అది విజయవంతంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. మరోవైపు ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే రెవెన్యూ అధికారి నరేందర్ వ్యవహారంపై ఆరా తీయగా ఈ ఘటన మొత్తం ఏసీబీ అధికారులు పరిధిలోకి వస్తుందని ఎక్కడ కూడా మున్సిపల్ కార్యాలయంలో సోదాలు జరగలేదని, ఆ అధికారి నివసించే ఇంటి పైన సోదాలు జరిగాయని ఆయన చెప్పారు. ఏసీబీ తనిఖీలు జరిగిన తర్వాత తాను గత రెండు రోజుల క్రితం మున్సిపల్ శాఖలో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగస్తులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటుచేసి ఎక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించినట్లు మున్సిపల్ కమిషనర్ చెప్పారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యంగా కలగకుండా ఉండేందుకు ప్రజలకు అందుబాటులో ఉండేలా మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి అందరికీ అందుబాటులో ఉండాలని తమ ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.