బతుకమ్మ భిక్కనూర్ : బిక్కనూర్ గ్రామంలో హైవేపై టోల్ ప్లాజా సమీపంలో శనివారంవాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించి నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు పోలీసులు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా భి క్కనూర్ సిఐ సంపత్ కుమార్ మరియు ఎస్ఐ సాయికుమార్ మాట్లాడుతూ వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. ఇందులో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.