తెలంగాణ యూనివర్సిటీ కి  వీ సీ నీ నియమించాలి..

  • రూరల్ ఎమ్మెల్యేకు  పి.డి.ఎస్.యూ వినతి  

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతన వీసీ ని వెంటనే నియమించాలని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కి పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఏడాదిన్నర నుండి యూనివర్సిటీలో రెగ్యులర్ విసి లేకపోవడం వలన విద్యార్థుల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, మైగ్రేషన్ కాన్వకేషన్, మెమోలు అప్లై చేసుకుని నెలలు గడిచిన ఇవ్వడం లేదని , దీనివలన విద్యార్థులు పై చదువులను మరియు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని , గర్ల్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి నూతనంగా మరో హాస్టల్ ను తొందరగా నిర్మించాలని , రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన యూనివర్సిటీలో బోధన కుంటుబడిపోయిందని , ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రోగమస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందని ఇందులో సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపెడితే జిల్లా విద్యార్థులకు, అదేవిధంగా పక్కన ఉన్న జిల్లా విద్యార్థులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ నాయకులు ప్రిన్స్, దేవిక, వంశీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

VC should be appointed for Telangana University..
Comments (0)
Add Comment